మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ
కమిషనర్ ఎన్.మౌర్య
మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా నగరంలోని వైకుంఠపురం ఆర్చి రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావారణాన్ని అందించిన వారమవుతామని అన్నారు. ఈ సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపి శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడకమిషనర్ ఎన్.మౌర్య
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
TEJA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్,ఉమ్మడి జీల్లా…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
TEJA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…