TEJA NEWS

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ సంజీవ్ ఖన్నా?

హైదరాబాద్:
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్, ప్రతిపాదించారు..

ఈ మేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కేంద్రానికి సిఫార్సు చేశారు..

ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితు లవుతారు. నిబంధనల ప్రకారం..ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపం లో కేంద్ర న్యాయశాఖకు పంపిస్తారు.

ఆ లేఖను కేంద్ర న్యాయ శాఖ, ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపిస్తుం ది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది.

అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయ మూర్తి బాధ్యతలను చేపడతారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వా త ఆ పదవిని చేపట్టడానికి ముందు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు.

ఆ లెక్కన జస్టిస్ డి. వై. చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్. ప్రస్తుత ప్రధాన న్యాయబి మూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్, పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 11తో ముగుస్తుంది.

ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 12వ తేదీన జస్టిస్ ఖన్నా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలను చేపట్టే ఛాన్స్ ఉంది. 6నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీన పదవీ విరమణ చేస్తారు.


TEJA NEWS