ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అమిలినేని

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అమిలినేని

TEJA NEWS

Amilineni inspected the EVM strong rooms

అనంతపురం జిల్లా కేంద్రంలోని జే ఎన్ టీ యు వద్ద ఈవీఎం లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి, వాటి భద్రత గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గారు.

జిల్లా కలెక్టర్ ని కలిసిన అమిలినేని
కళ్యాణదుర్గం ప్రాంత సమస్యల మీద, జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అమిలినేని సురేంద్రబాబు .

  1. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సమస్యల్ని కలెక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి 40 లక్షల ఇప్పటికే రిలీజ్ చేశారని, మిగిలిన సమస్యను కూడా అతి తొందరలో పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
  2. ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి దాడులు గురించి ప్రత్యేకంగా కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది, ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఎన్నికల సందర్బంగా కారుపై దాడికి పాల్పడిన విషయాన్ని ప్రత్యేకంగా చర్చించడం జరిగింది…
  3. బీటీపీ ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో వాటర్ గురించి కలెక్టర్ తో ఆమిలినేని సురేంద్రబాబు మాట్లాడారు. ఆ నీటిని వృధా కాకుండా ప్రణాళిక బద్ధంగా చెరువులకి ఎలా తీసుకెళ్లాలి ఆ నీటి ద్వారా ప్రజల నీటి కష్టాలను పోగొట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు..
  4. గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన రహదారులు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు గురించి కూడా మాట్లాడారు..
  5. APIIC భూమిలో చిన్న పరిశ్రమల గురించి చర్చించడం జరిగింది..
  6. వీటన్నింటిపై కలెక్టర్ స్పందించి తప్పకుండా కళ్యాణదుర్గం ప్రాంథంలోని సమస్యల పరిష్కారం, మిగిలిన అంశాలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది…
Print Friendly, PDF & Email

TEJA NEWS