TEJA NEWS

నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు పాండురంగ స్వామివారికి ఆషాడ పట్టి, రుక్మాబాయి అమ్మవారికి సారే సమర్పణ జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ధర్మకర్త తాటికొండ కోటేశ్వరరావు, కుమారి వాణి దంపతులచే మరియు భక్తుల సహకారంతో పూజా కార్యక్రమములు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాసరావు,తుమ్మలపెంట రామచంద్రరావు, కొత్త మాసు సుజాత లక్ష్మి,పల్లబోతుల సురేష్,బత్తుల శ్రీలక్ష్మి,మద్ది అంజనదేవి,కొత్త మాసు శాంత కుమారి,పల్లబోతుల ప్రమీల రాణి, అర్వ పల్లి హైమావతి గుండా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.అమ్మవారికి పూలు, గాజులు, పసుపు, కుంకుమ, గంధం, చీరలు, జాకెట్లు, వివిధ పిండి వంటలు అనేక సారె కు సంబందించిన ఐటమ్స్ అమ్మవారికి సమర్పించడం జరిగినది.


TEJA NEWS