TEJA NEWS

ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ శేషగిరిరావు మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81వ బెటాలియన్‌లో చోటు చేసుకుంది. సమీపంలోని అడవిలో కూంబింగ్‌కు శేషగిరిరావు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న ఏకే 47 తుపాకీ పేలి ఛాతీ కింది భాగంగాలో తూటా దిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న శేషగిరిని మిగిలిన జవాన్లు బేస్‌ క్యాంప్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 73 కి.మీ దూరంలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతిచెందారు. శేషగిరి ఏపీలోని అనంతపురం జిల్లా వాసిగా తెలిసింది. …


TEJA NEWS