TEJA NEWS

గుంటూరు జిల్లా

జనసేన కార్యకర్తలము అంటూ ఎటుకూరు లో వ్యాపారస్థుల పైన దాడి

జనసేన కార్యకర్తలము అంటూ ఎటుకూరు లో వ్యాపారస్థుల పైన దాడి, వాటర్ సప్లై చేసిన బిల్ కోసం వెళితే అన్న తమ్ముళ్ల పైన దాడి


వివరాల లోకి వెళితే సంగడిగుంట లో నివాసం ఉంటున్న మారెడ్డి కృష్ణచైతన్య రెడ్డి మరియు తన తమ్ముడు మారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వహించు కుంటూ జీవనం సాగిస్తున్నారు

వాళ్ళు తమ వ్యాపారం రీత్యా ఎటుకూరు లోని ఒక డాబా కి వాటర్ సప్లై చేసారు, నెల రోజులకు పైబడిన బిల్ ఇవ్వకుండా తిప్పుతున్నారు అని సప్లై చేసిన బిల్ నిమిత్తము మొదట తమ్ముడు మారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లి బిల్ అమౌంట్ అడిగాడు

చాలా సేపు వెయిట్ చేయించి ఇప్పుడు కాదు తరువాత రా అని దుర్భషాలాడాడు ఏంటి ఇది ఇంత సేపు కూర్చోబెట్టి మళ్ళీ రేపు అంటున్నారు అని అడగగా అసలు ఇవ్వను ఏమి చేసుకుంటావు రా నువ్వు అని కొట్టారు

తనని కాపాడాలంటూ అన్నయ్య మారెడ్డి కృష్ణాచైతన్య రెడ్డి కి ఫోన్ చేసాడు అంట అయితే హుటాహుటిన తమ్ముడు కి ఏమైంది అని కృష్ణచైతన్య అక్కడికి వెళ్లగా తమ్ముడు దెబలు తిని ఉండటం చూసి ఏమైంది ఎందుకు కొట్టారు అని అడిగి నందుకు అన్న మారెడ్డి కృష్ణచైతన్య రెడ్డి మీద కూడా దాడి చేసి మీకు దిక్కు ఉన్న చోట చెప్పు కొండి ఇది మా గవర్నమెంట్ మేము జనసైనికులం అని దుర్భషాలాడారు అని మారెడ్డి కృష్ణచైతన్య రెడ్డి వాపోయాడు,

తమని ఇంతగా కొట్టి దుర్భషాలాడిన వ్యక్తుల పైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు బాధితులు

Print Friendly, PDF & Email

TEJA NEWS