ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

TEJA NEWS

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చును. ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సమాచారమును అందించిన వారి యొక్క వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతుంది.

దాడికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారము తెలియజేయాలనుకునేవారు ఈ దిగువ తెలుపబడిన వారికి ఫోన్ ద్వారా గాని, వాట్స్ అప్ ద్వారా గాని, లేదా నేరుగా గాని వచ్చి తెలియజేయగలరు.
ఫోన్ నెంబర్లు: 1. శ్రీ కంచి శ్రీనివాస రావు, డి.సి.పి. ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ – 9490619342

  1. శ్రీ ఆర్.శ్రీహరిబాబు, ఏ.డి.సి.పి.టాస్క్ ఫోర్సు – 9440627089
    ఆఫీస్ అడ్రస్: కమీషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన,
    లబ్బిపేట్, కృష్ణ లంక, విజయవాడ.
Print Friendly, PDF & Email

TEJA NEWS