TEJA NEWS

మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, విఠల్, పాండుగౌడ్, షౌకత్ అలీ మున్నా, నాగేష్ గౌడ్, ఆదర్శ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS