TEJA NEWS

మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీలో ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు సర్కిల్ ఇస్పెక్టర్ కె.క్రాంతి కుమార్ పాల్గొని మట్టి గణేశుని ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో లద్దే నాగరాజు, బోయా కిషన్, శ్రీధర్ పండితులు, ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం అధ్యక్షులు చింది బద్రీనాథ్ ప్రధాన కార్యదర్శి వి ఆర్ విజయలింగం, సంయుక్త కార్యదర్శి రేవని జగదీశ్వర్, ఉపాధ్యక్షులు మునింగం జితేందర్, ఆకాంక్ష ఫౌండేషన్ చైర్మన్ సి.హెచ్ వి రామారావు, మీడియా ఇన్చార్జి నవీన్ రామోజీ, జగదీష్, మల్లికార్జున్, జగదీశ్వర్, మొనప్ప తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS