TEJA NEWS

అన్నే రామకృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్.

మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే రామకృష్ణ స్వర్గస్తులైనందున ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర , పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ , మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు తో పాటుగా సందర్శించి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన రాజేంద్రప్రసాద్ .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో, క్రమశిక్షణతో ఉంటూ పార్టీకి అనేక విధాలుగా సేవ చేసినటువంటి రామకృష్ణ మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధాకరమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటుగా మిగిలిపోతుందని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాజేంద్రప్రసాద్ అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS