TEJA NEWS

శంకర్‌పల్లి KIDZEE పాఠశాలలో ముందస్తు శ్రీ కృష్ణజన్మాష్టమి
శంకరపల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి KIDZEE పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. విద్యార్థులు రాధా కృష్ణులు, గోపికల వేష దారణలో సందడి చేశారు. ముందస్తు వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అశ్విని రెడ్డి, ఉపాధ్యాయులు స్నేహలత సాయికిరణ్ రెడ్డి, మహీనా పాల్గొన్నారు.


TEJA NEWS