TEJA NEWS

సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు – పట్టణంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నాయకులు.

సూర్యాపేట పట్టణంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్బంగా రెడ్ హౌస్ కార్యాలయం లో అభిమానులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదనంతరం దామోదర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్, 19వ వార్డ్ ఇన్చార్జి షేక్ గౌస్ ఆద్వర్యంలో పట్టణంలోనీ ఖమ్మం రోడ్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇదే విషయమై గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం తో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి మాట్లాడుతూ దామోదర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నాయకుడంటే ప్రజల మనసును గెలుచుకోవాలని, ఆస్తులను పెంచుకోవడానికి దామోదర్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని సేవ దృక్పథం తో ముందుకు వెళ్లే వ్యక్తి అని అన్నారు. భగవంతుని అశీసులు మా నాయముడిపై మెండుగా ఉండాలని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజలకు మరెంతో చేయుతనివ్వలని సూర్యాపేట పట్టణ ప్రజల పక్షాన కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజద్ అలి, అబూబకర్ సిద్దిక్,మున్ను ఇస్మాయిల్, నీడ్స్ సాదిక్, తాడి ప్రభాకర్, కనుగు రాంబాబు, అబ్బాస్,ఏజాస్ తదితరులు హాజరయ్యారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS