TEJA NEWS

మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆర్ధిక సహాయం

ఉమ్మడి ఖమ్మం

సెప్టెంబర్‌ 21 న కొణిజర్ల పోలీస్ స్టేషన్ విధి నిర్వహణలో వున్న 2000 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఈ.లోకేష్
అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో మృతిని కుటుంబ సభ్యులకు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు చెందిన తోటి బ్యాచ్ పోలీస్ సిబ్బంది తమవంతు సహాయంగా 2,00,000/- ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందించారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అకస్మాత్తుగా దూరమయ్యాడం… ఆయన్నే నమ్ముకున్న ఆ కుటుంబం రోడ్డున పడవద్దని… తోటి మిత్రులు ఒక్కటయ్యారు. ఆ కుటుంబానికి తామున్నామని అండగా నిలిచారు. తలా కొంత చేయి వేసి పిల్లల భవిష్యత్తుకు తమవంతు భరోసా కల్పించారు. బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు చెక్కు ను అందజేశారు.


TEJA NEWS