సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

TEJA NEWS

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS