TEJA NEWS

గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేన దూరమా…? ఎన్డియే వ్యూహం ఏంటీ…?

ఏపీలో అధికారాన్ని బీజేపి ఎంత వరకు ఎంజాయ్ చేస్తోందో గాని… తెలంగాణాలో మాత్రం బిజేపికి విజయం అత్యంత కీలకం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపి మెయిన్ గేటుగా భావించే కర్ణాటకలో అధికారం కోల్పోవడం, తెలంగాణాలో విజయలక్ష్మి వరించకపోవడం బిజేపిని కలవరపెడుతున్న అంశం. గత పదేళ్లుగా కేసీఆర్… బీజేపికి సహకరించినా అధికారం లేదనే లోటు కమలం పార్టీలో ఉంది. ఒడిస్సా లాంటి రాష్ట్రంలో పాతుకుపోయినా బిజూ జనతాదళ్ ను ఓడించి అధికార పీఠం ఎక్కిన కాషాయ పార్టీ… తెలంగాణాలో మాత్రం అధికారం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కమలం పార్టీకి దక్కడం లేదు. చివరికి ఏపీలో ఎన్డియే రూపంలో అధికారంలో ఉన్నా తెలంగాణాలో అది కూడా సాధ్యం కావడం లేదు. అందుకే ఇప్పుడు బీజేపి… హైదరాబాద్ నుంచి రాజకీయం మొదలుపెడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో పీఠం ఈసారి ఎలా అయినా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బీఆర్ఎస్ ను చీల్చడానికి సిద్దమైంది అనే ప్రచారం ఇప్పటికే నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల ఏపీ సిఎం చంద్రబాబును కలిసి తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్దం అని చెప్పడం వెనుక బిజేపి హ్యాండ్ ఉందనేది బీఆర్ఎస్ భయం.


TEJA NEWS