TEJA NEWS

పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTR

చేతగాని సీఎం, హోంమంత్రి ఉండటం వల్లే ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి కేటీఆర్‌ వెళ్లిన సందర్భంగా మాట్లాడారు. ‘పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలి. పార్టీ మారానని శెరిలింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారు. అలాంటి ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. అరెకపూడి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారు’ అని మండిపడ్డారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS