TEJA NEWS

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి..!!

హైదరాబాద్/బషీర్ బాగ్ : సర్పంచుల పెండింగ్బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్ డిమాండ్చేశారు.

తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‎లోని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సర్పంచులు నిరసన తెలిపారు. గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 9నెలలు అవుతున్నా తమకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS