TEJA NEWS

లోకేష్ చొరవతో కమ్మవారిపాలెం పాఠశాల తిరిగి ప్రారంభం : నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో లోకేష్ చొరవతో పాఠశాల తిరిగి ప్రారంభం విద్యార్థులు లేరన్న సాకుతో గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు దీంతో గ్రామంలోని విద్యార్థులు పాఠశాల లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో టిడిపి గ్రామ నాయకులు గంగినేని రాధాకృష్ణ బాబు మేదరమెట్ల శ్రీనివాసరావు పాస్టర్ ప్రభుదాస్ లు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహకారంతో విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ని కలిసి పాఠశాలల్లో పునరుద్ధరించాలని కోరారు దీనిపై స్పందించిన లోకేష్ తిరిగి వెంటనే కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు పేద మధ్యతరగతి ప్రజలకు చదువులు సరస్వతిని దరి చేర్చేందుకు లోకేష్ చూపిన పరోపట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు

Print Friendly, PDF & Email

TEJA NEWS