Shankarpalli is a young lady who excelled in the NEET entrance exam
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష
2024-25 లో పొద్దుటూరు విద్యార్థి గండిచర్ల దీపిక అత్యుత్త మ ప్రతిభ కనబరిచింది. శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన గండిచర్ల గోవర్ధన్ రెడ్డి మాధవిల కూతురు దీపిక జాతీయస్థాయిలో దేవిక 2672 ర్యాంక్ సాధించి (99.88) అందరినీ అబ్బుర పరిచింది. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలో ర్యాంక్ సాధించింది. మియాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపీసీ ) రెండో సంవత్సరం పూర్తి చేసి గత నెలలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష రాసింది. ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 974 సాధించింది. కాగా తమ కూతురు దీపిక ఉత్తమ ప్రతిభ కనబరచడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-14.50.07-812x1024.jpeg)