TEJA NEWS

సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది….అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ..
……………………………………………………………..
సాక్షిత : జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వాసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించి,పిల్లల, కంటి వార్డులని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఆసుపత్రి సందర్శనలో భాగంగా జగిత్యాల మండలం కి చెందిన మహిళ ప్రసూతి సమయంలో అనారోగ్యం తో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా సంబంధిత వైద్యలు వారి సిబ్బంది మెరుగైన చికిత్స అందించి తల్లి పిల్లల ప్రాణాలు కాపాడగా,పిల్లల వార్డులో శిశువు ను పరిశీలించి,ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకునీ వైద్యులను వారి సిబ్బంది సేవలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

ఎమ్మెల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం పై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు..

మెడికల్ హబ్ గా జగిత్యాల.

జగిత్యాల మండలానికి చెందిన గర్భిణీ అనారోగ్యం తో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రసూతి చేసి తల్లి బిడ్డను వైద్యులు రక్షించారు…

వెంటిలేటర్ పై ఉన్న తల్లి ఆరోగ్యం బాగుంది.

1 కేజీ 500 గ్రాముల పాప జన్మించింది,పాప ఆరోగ్యం సైతం భాగింది,వైద్యులు పాపకు ఆక్సీజన్,ఫ్లుయిడ్స్ ఇస్తున్నారు.

తల్లి పిల్లను కాపాడిన వైద్యులకు,సిబ్బందికి అభినందనలు .

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కారణంగా బెడ్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది.

జగిత్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలతో మాట్లాడగా వైద్య సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారనీ ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ గా ఉన్న వైద్య పోస్టు ల నియామకం పై DME గారితో ఫోన్ లో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే అన్నారు.

10 కోట్ల తో క్రిటికల్ కేర్ యూనిట్ ని సైతం ఏర్పాటు చేస్తున్నాం.త్వరలో ప్రారంభిస్తం..

జగిత్యాల జిల్లా పజలకు మెరుగైన చికిత్స అందించేందుకు తనవంతుగా కృషి చేస్తా.. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భం గా ప్రజలను కోరుతున్న అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.రాములు,HOD అరుణ,RMO యాకుబ్ పాషా,డా.గీతిక,నాయకులు బోనగిరి నారాయణ,భూపెళ్లి శ్రీనివాస్,శేఖర్,
వైద్యులు,పారామెడికల్ స్టాఫ్,సిబ్బంది,తదితరులు , పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS