TEJA NEWS

తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారు:

* బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచనలు మేరకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, గాజుల సుజాత, రఘూవేంద్ర రావు, జ్యోతి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, నాయకులు సాంబ శివ రెడ్డి, దశరథ్, కుమార్ రెడ్డి, బిక్షపతి, ముత్యాలు, మేకల మధు, జలగం చంద్రయ్య, గౌస్ భాయ్, మహిళా నాయకులు సరస్వతి, మంజుల, యువ నాయకులు లింగయ్యత్ శివ, తొంట చందు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS