వాలంటీర్ తో సహా వైసీపీ నేతలు టీడీపీ లో చేరిక

Spread the love

కావలి పట్టణ 38వ వార్డు వైకుంఠపురంకు చెందిన వాలంటీర్ అలాగే పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో 38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్, వల్లెపు కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వాలంటీర్ పల్లపు జయశ్రీ, వైసీపీ నేతలు పల్లపు ప్రభాకర్, పల్లపు శివకృష్ణ,పల్లపు సరిత, తన్నీరు మాల్యాద్రి, తన్నీరు కోటేశ్వరమ్మ, కుంచల ప్రవళిక, మల్లి కోటేశ్వరి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.. నాయకుల వరుస చేరికలతో కావలి నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో వార్డ్ నాయకులు ఇంటూరి భాస్కర్ రావు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

You cannot copy content of this page