హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెల్లవారుజామునుంచే హైదరాబాద్లో పలుచోట్ల వర్షం పడింది. చిక్కడపల్లి, హిమాయత్నగర్, అబిడ్స్, బాలాపూర్, బర్కత్పురా, కార్వాన్, సికింద్రాబాద్లో జల్లులు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలులతో చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.నిజామాబాద్ జిల్లాలో భారీగా పంటనష్టం, పశువులు మృతి చెందగా, సిద్దిపేట,దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ.
Related Posts
ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా
TEJA NEWS మల్కాజిగిరిమౌలాలి డివిజన్ ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా సంస్థ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్ పర్సన్ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవ చేస్తున్న…
ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలి
TEJA NEWS ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలిమున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాతమకంగా చేపట్టిన డిజిటల్ సర్వే కు కావలసిన వివరాలు గృహయజమాలు సర్వే సిబ్బందికి అందివ్వాలి అనీ మున్సిపల్…