సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

TEJA NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు..

రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు..

ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS