TEJA NEWS

అమరావతి…

రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్.

వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు.

అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు చేసిన మంత్రి..

పలు ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి.

డ్రైన్ లలో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ

ఈ నెల 15న రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ లు ప్రారంభిస్తున్నాము.

33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు.

రాబోయే వారంరోజులు అన్న క్యాంటీన్ లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్ తో సమన్వయం చేసుకోవాలని తెలిపిన మంత్రి నారాయణ.


TEJA NEWS