TEJA NEWS

మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో కొనింటి శశికాంత్
10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న
ఆశీర్వదించి గెలిపించండి


శంకర్‌పల్లి: . కాంగ్రెస్ పార్టీ మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన కొనింటి శశికాంత్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నట్లుగా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శంకర్‌పల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికలు ఆగష్టు10 నుండి సెప్టెంబర్ 10 వరకు ఆన్ లైన్ పద్ధతిలో జరుగుతాయన్నారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి అంకిత భావంతో పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆదరించి గెలిపించాలన్నారు. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడే ఈ అధ్యక్ష పోటీల్లో కార్యకర్తలు అందరూ తనకు మద్దతుగా యువకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించాలని, పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని, ఆన్ లైన్ ద్వారా తనకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో వచ్చేలా చూడాలని కోరారు.


TEJA NEWS