TEJA NEWS

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి..
ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం..
ఆలయ నిర్మాణంలో నా వంతు సహాయంగా స్లాబ్ వేయించడం నా పూర్వ జన్మ సుకృతం – నీలం మధు ముదిరాజ్

పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
శుక్రవారం పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని న్యూటన్ కాలనీలో శివ పంచాయతన నాగేంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆలయాల నిర్మాణాలతో గ్రామాలలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరుస్తుందన్నారు.
ఆలయాల నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దత్తు పంతులు, గడిల శ్రీధర్ గౌడ్, సిహెచ్ సంజీవ, వెంకట్ రెడ్డి, అరవింద్ గౌడ్,అర్జున్,రమేష్,సురేష్, ప్రవీణ్ గౌడ్, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS