TEJA NEWS

దేవాలయాల సందర్శన మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ …

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లో నూతనంగా నిర్మించిన నాగుల ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ సందర్శనలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అలాగే దైవనామస్మరణ మనలోని చెడును తొలగించి మంచిది పెంపొందిస్తుందన్నారు. అనంతరం భౌరంపేట్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవ వేడుకలల్లో పాల్గొని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, కామేష్, బాబీ, రాజు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS