హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కిందికుంట పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సానుకూలంగా స్పందిస్తూ పార్క్ లోకి వాకింగ్కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే ఓపెన్ జిమ్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్ చుట్టుపక్కల మొక్కలు, పుట్పాత్లపై బెంచీలను ఏర్పాటు చేస్తామని. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ హైటెన్షన్ లైన్ రోడ్డు లో గల కిందికుంట పార్క్
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…