TEJA NEWS

వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : నిరుపేదలకు వైద్య సాయాన్ని అందించేందుకు తాము నిరంతరం సిద్దంగా ఉంటామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన స్టాలిన్, వారాసిగుడా కు చెందిన బీ పాషా లు అనారోగ్యం బారిన పడి వైద్య సాయానికి సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించారు. వెంటనే ఎం.ఎల్.ఏ. తీగుల్ల పద్మారావు గౌడ్ చొరవ తీసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.రెండు లక్షల చొప్పున రూ.నాలుగు లక్షల మేరకు ఎల్.ఓ.సీ. పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చి తన కార్యాలయంలో అందింజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు తమ సితాఫలమండీ లోని తమ కార్యాలయం బాసటగా నిలుస్తుందని తెలిపారు. గత పదేళ్ళ కాలంలో రికార్డు సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు అందించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


TEJA NEWS