TEJA NEWS

గుండె పోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన మహిళ

విజయవాడ బస్టేషన్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రావుల పాలెం వెళ్ళుతున్న బస్సులో ఎక్కిన మహిళ విజయవాడలో గుండె పోటు తో మరణించినట్లు ఆర్టీసీ సిబ్బంది గుర్తించారు. అసలు విషయానికి వస్తే కృష్ణలంక పోలీస్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారమే కానీ ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారమే కానీ ఇచ్చిన సమాచారం ప్రకారం గంట సత్యపద్మ (30) ఇతర దేశంలోని ఒమెన్ లో విమానం ఎక్కుతున్నట్టు తన పాస్ పోర్టులో ముద్రించుకుని ఉంది. అయితే సత్యపద్మ అనే ఆవిడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన అనంతరం అందుబాటులో ఉన్న తన ఊరుకి వెళ్ళవల్సిన బస్సు సర్వీసు నెం. 98312 ఏ.పి.05 జడ్ 5078 కలిగిన బస్సు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రావులపాలెం వెళ్ళే ఈ బస్సులో ఎక్కింది. మార్గమధ్యలో భోజనం నిమిత్తం సూర్యారావుపేటవద్ద ఆపగా తన సీటు పక్కనే ఉన్న ఆవిడకు తమ్సప్ బాటిల్ తెచ్చివ్వమని అడిగింది. అనంతరం బస్సు బయలుదేరిన తర్వాత విజయవాడకి చేరుకున్న అనంతరం పక్కనే సీటులో ఉన్నటువంటి ప్రయాణికురాలు తాను దిగి వెళ్ళిపోతున్నానని పదే పదే తనని లేపగా తాను సమాధానం ఇవ్వకపోవడంతో డ్రైవర్ కి సమాచారం అందించింది. దీనితో విజయవాడ లోని అరెవల్ బ్లాక్ లోని 55 వ ప్లాట్ ఫాం లో ఆగిన అనంతరం ఈ విషయాన్ని గ్రహించనటివంటి ఆర్టీసీ డ్రైవర్ వెంటనే తన అధికారులకి సమాచారం అందించారు. దీనితో కృష్టలంక పోలీసులకి సమాచారాన్ని అందించడంతో ఎస్ఐ తోటి సిబ్బందితో వచ్చి పరిశీలించి తన వద్దనున్న సమాచారంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు…. వెంటనే 108 ను పిలిపించి తన మృతదేహాన్ని వారి స్వగ్రామం పంపించారు….

Print Friendly, PDF & Email

TEJA NEWS