TEJA NEWS

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని యాత్రికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్‌లో రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది యాత్రికులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సహాయ కార్యనిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గంటే ఏం చేస్తున్నారని యాత్రికులు ఆయన్ను నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు యాత్రికులు ఫిర్యాదు చేశారు.


TEJA NEWS