TEJA NEWS

శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని PJR నగర్ కాలనీ లో ఉన్న దర్గా ప్రాంగణంలో శ్రీ షౌకత్ అలీ మున్నా , ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , ముస్లిం సోదరులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ”మిలాద్-ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని సూచించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు… ముస్లిం సోదర, సోదరీమణులకు ‘ఈద్ మిలాద్-ఉన్-నబి’ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో ప్రసాద్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,కాశినాథ్ యాదవ్, మరేళ్ల శ్రీనివాస్, మూర్తుజా, కైసర్, మల్లేష్, షాహీద్ అలీ, షకీల్ మున్నా, ఖాజా మియా, ఇంతియాజ్, మౌలానా, బషీర్, అస్లాం, అహ్మద్, సుల్తాన్, ఇక్బాల్, సలీమ్, అలీ, హాలిమ్, అంజాద్, షకీల్, పోశెట్టిగౌడ్, మహేష్, విలన్ శివ, షేక్ బీబీ, పుట్టం దేవి, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS