TEJA NEWS

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు .. సచివాలయంలో భూమిపూజ.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయంలో భూమిపూజ జరిగింది. భూమిపూజలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఏర్పాటు స్థలాన్ని కూడా సీఎం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS