TEJA NEWS

మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన బిచ్చాల

ఖమ్మం కోర్టు ప్రాగణంలో సీనియర్ న్యాయవాది బిచ్చాల తిరుమల రావు ఆధ్వర్యంలో మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణన చేయాలని రాజ్యాంగబద్దంగా ఏ హక్కులకు నోచుకోక చట్టసభలలో ప్రాతినిధ్యాలు లేక దేశ జనభాలో సగానికి పైగా ఉన్న బి సి ల కు న్యాయం చేయాలని, బి సి లకు చట్ట సభలలో, స్థానిక సంస్థలలో , బి సి ల రిజర్వేషన్ ల పోరాటం కోసం బి సిల కు, తమకు రావలసిన రిజర్వేషన్ లు అందటం లేదని వాటి సాదన కోసం బి సి లు కృషి చేయాలని, తెలంగాణ ఉద్యమంలో బి సి పాత్ర మరవలేనిదని తెలంగాణ ఉద్యమకర్తలు కొండా లక్ష్మణ్ బాపూజీ, డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ లని, బిచ్చాల తిరుమల రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ళ శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు మేకల సుగుణరావు, ఓరుగంటి శేషగిరిరావు, మధు, మలీదు నాగేశ్వరరావు, చింతల వెంకట్, ఆకుల శేఖర్ బాబు, సింగమ్ జనార్థన్, లింగయ్య, జి. వి. లక్ష్మీ నారాయణ, జి. వీరభధ్రం,గాజుల అమర్ నాద్, సీనియర్ జూనియర్, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS