TEJA NEWS

బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు.. అందుకే కవితకు బెయిల్: మహేష్‌కుమార్‌ గౌడ్.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌ కుమ్మక్కైందని.. అందుకే కవితకు బెయిల్ వచ్చిందని మహేష్‌కుమార్‌ గౌడ్ అన్నారు. కేటీఆర్‌, హరీష్‌రావు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల చుట్టూ తిరిగి.. కవితకు బెయిల్‌ తెచ్చుకున్నారని ఆరోపించారు. కవితకు బెయిల్ వస్తుందని ముందే ఊహించామని.. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం బెయిల్ వచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో కేసుకు రూ. 10 లక్షల విలువైన రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా కేసుకు సంబంధించి ఎవరిని ప్రభావితం చేయకూడదని… పాస్ పోర్టును అప్పగించాలని ఆదేశించింది. పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS