TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, రోడ్డును లెవెల్ చేసి వర్షపు నీరు నిలవకుండా ముందస్తు ప్రణాలికతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్లు మహదేవ్ కాలనీ వాసులు కుమార స్వామి, ప్రసాద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS