TEJA NEWS

వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్..

మల్కాజిగిరి :
వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట, టాయిలెట్స్ లైట్స్, మెడికల్ తదితర అంశాల పైన అధికారులతో ఏర్పాట్లకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో డి. సి రాజు, టౌనప్లానింగ్ డిసిపి శ్రీనివాస్, ఈఈశ లక్ష్మణ్ , ఏఈ దీపక్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS