TEJA NEWS

ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలో జరిగిన గడ్డం రామయ్య కుమారుని వివాహ వేడుకకు, ఖమ్మం నగరంలో జరిగిన యమ్మని ఉపేందర్ కుమార్తెల పుష్పాలంకరణ వేడుకకు, కిలారు బలరాం దశదిన కర్మకు హాజరైయ్యారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో జరిగిన తోటమల్ల రాములు కుమారుని వివాహ వేడుకకు హాజరైయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి పట్టువస్త్రాలతో పాటు రూ.50వేలు విలువచేసే ఏసీని ముదిగొండ మండల నాయకులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో కానుకగా అందజేశారు.

రూ.2.50లక్షల ఎల్ ఓ సి అందజేత…

ఖమ్మం నగరం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సీతా సత్యం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా అతనికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి సిఫారసుతో మంజూరైన రూ. 2.50లక్షలఎల్ ఓ సి ని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అందించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS