TEJA NEWS

గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: KTR

గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: KTR
వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నిరసనలు చేయడం ఈ ఏడాదిలోనే పెద్ద జోక్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీని ఆహ్వానించి, ఒప్పందాలు చేసుకొని, ఇప్పుడు ఆయన్నే మోసగాడిగా చూపిస్తున్నారని విమర్శించారు. గల్లీలో స్నేహంగా ఉంటూ ఢిల్లీలో ఫైట్ చేయడం కాంగ్రెస్ లోనే ఉంటుందని సెటైర్ వేశారు. ఇదెలాగో వివరించాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.


TEJA NEWS