TEJA NEWS

శంకర్‌పల్లి పట్టణంలోని వీధి కుక్కల తరలింపు
ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందిస్తున్న కమిషనర్ శ్రీనివాస్
అభినందిస్తున్న పట్టణ ప్రజలు

సాక్షిత శంకర్‌పల్లి:
శంకర్‌పల్లి లోని పలు వార్డుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది అటవి ప్రాంతాలకు తరలించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతు ప్రజల మీదికొస్తున్నాయని గమనించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సంబంధిత సిబ్బందిని పురమాయించి 14వ వార్డులో ఉన్న కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వాహనంలో కుక్కలను తరలించి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలని కుక్కలను తరలించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు వారి వారి కాలనీలలో కుక్కల బెడద ఉన్నట్లయితే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. శ్రీ కృష్ణాష్టమి రోజున మున్సిపల్ కార్యాలయానికి సెలవు ఉన్న ప్రజల కొరకు మున్సిపల్ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందిస్తున్న కమిషనర్ శ్రీనివాస్ ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
.

Print Friendly, PDF & Email

TEJA NEWS