TEJA NEWS

స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ..

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, పచ్చదనాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డి.పోచంపల్లి 10 వార్డులో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి బొంగునూరి నవిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, నాయకులు, అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, తమ పరిసరాల్ని పరిశుబ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి , దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ , కాంగ్రెస్ B-బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్ రాము గౌడ్ , కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి , కాలనీ వెల్ఫేర్ అధ్యక్షులు వెంకటేష్, సంజీవరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఉమర్, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


TEJA NEWS