TEJA NEWS

పిల్లిగుండ్ల గ్రామ గణేష్ లడ్డూను రూ. 2 లక్షల 20 వేలకు కైవసం చేసుకున్న మాజీ ఉపసర్పంచ్ ధరణి అయిలయ్య

శంకర్‌పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను వేలం పాటలో మాజీ ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య మొదటి లడ్డు రూ. 2 లక్షల 20 వేలకు, రెండవ లడ్డు రూ. లక్ష 71 వేలకు కైవసం చేసుకున్నారు. మాజీ ఉపసర్పంచ్ ను చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ముఖ్య అతిధిగా హాజరై ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, రెండు లడ్డూలను అందజేశారు. మాజీ ఉపసర్పంచ్ మాట్లాడుతూ లడ్డు వేలంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దైవచింతలతోనే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందని ధరణి ఐలయ్య తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు చాన్ పాషా, రామరాజు రెడ్డి, భాగ్యమ్మ, నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, మాణిక్యం, మొగులయ్య, మహేందర్, మధుకుమార్, రాఘవేందర్, కృష్ణ పాల్గొన్నారు.


TEJA NEWS