TEJA NEWS

మండల కార్యాలయాలకు శంఖు స్థాపన చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హాజరైన భూదాత వారసులు

హర్షం వ్యక్తం చేసిన మండల వాసులు

బుగ్గారం / జగిత్యాల జిల్లా :

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని నడి బొడ్డున గల గడి ప్రదేశంలో భూదాత వారసుల సమక్షంలో మండల తహసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల భవన నిర్మాణాలకు శుక్రవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంఖు స్థాపన చేశారు. రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ కార్యాలయాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆయన కోరారు. గ్రామస్తుల కోరిక మేరకు గతంలోనే ఈ భూమిని దానం చేసిన కీ.శే. గూడూరి వీర వెంకట సదాశివ రావు పేరుతో నే ఈ భవనాలకు నామకరణం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ జిల్లా ఇంజనీరింగ్ అధికారి యం. ఎ. రహమాన్, డిప్యూటి ఇఇ కంటే గోపాల్, ఎ. ఇ. సయ్యద్ ముఖరం, స్థానిక తహసీల్దార్ మాజిద్
మహమ్మద్ అబ్దుల్,
ఎంపిడివో శ్రీనివాస్, ఎంపీఓ అఫ్జల్, ఆర్. ఐ. బాపు రెడ్డి, కొండపల్లి సంతోష్ రావు, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగునూరి చిన్న రామగౌడ్, నర్సగౌడ్, ఎండిసి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సై శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో తన పోలీస్ సిబ్బందితో తగు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా భూదాత వారసుడైన గూడూరి వీర రంగారావు ను, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో మండల ప్రజలు, బుగ్గారం వాసులు, విడిసి, ఎండిసి కార్యవర్గం, కుల సంఘాల వారు, అభిమానులు ఘనంగా సత్కరించారు.


TEJA NEWS