TEJA NEWS

హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్ చేయడానికే పెట్టినట్లు ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు.. ముందుగా తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరుపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌ను కూడా హైకోర్టు ప్రశ్నించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో ఉన్న కావూరి హిల్స్ కాలనీలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి.. కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

అదే ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇనార్బిట్ మాల్, రహేజా టవర్స్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ మహా నగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయి. వారందరికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదు.. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారని హైకోర్టు అడిగింది.

కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS