విజయవాడ సెంట్రల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాజా రఘునాదం, మంచుకొండ చక్రవర్తి

విజయవాడ సెంట్రల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాజా రఘునాదం, మంచుకొండ చక్రవర్తి

TEJA NEWS

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 23వ డివిజన్, సీతారామపురం, పాపయ్య వీధి పరిసర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో

విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ

ఎంపీ కేశినేని నాని అల్లుడు కాజా రఘునాదం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

డివిజన్ పరిధిలో ప్రతీ గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఎంపీ కేశినేని నాని కి, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కి రెండు ఓట్లు “ఫ్యాన్” గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు.

ఈ సందర్భంగా కాజా రఘు గారు మాట్లాడుతూ…

  • ఈ ప్రభుత్వం మాకు మంచి చేసింది, ఇలాంటి ప్రభుత్వానికి మేమే అండగా ఉంటామని ప్రజలు చెప్పడం సంతోషంగా ఉంది.
  • చేసిన పని చూసి ఓటు వేయమని కోరిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
  • విజయవాడ అభివృద్ధిలో ఎంపీగా కేశినేని నాని కి ప్రత్యేక స్థానం ఉంది, ఏం చేశారో ప్రజలు కూడా చూశారు.
  • పని చేసే నాయకులు కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ మరింత అభివృద్ధి చెందుతుంది.

ఈ ప్రచారంలో వైయస్సార్సీపీ ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS