గవర్నర్ ను కలిసిన ఖమ్మం ఎంపీ
జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరిన రఘురాం రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్థూపం, కూసుమంచి లో కాకతీయులు నిర్మించిన శైవాలయం.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానంతో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సింగరేణి, పలు కేంద్రీయ పరిశ్రమలు, ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. తమరు రాష్ట్ర గవర్నర్ గా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే.. మరింత ప్రాచుర్యం లభిస్తుందని, వీలైనంత త్వరగా రావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందిస్తూ.. తప్పకుండా వీలైనంత త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తానని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి మాటిచ్చారు. ఎంపీ స్పందిస్తూ.. గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ ను కలిసిన ఖమ్మం ఎంపీ
Related Posts
వినాయకునికి ప్రత్యేక పూజలు
TEJA NEWS వినాయకునికి ప్రత్యేక పూజలు || కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు…
పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన
TEJA NEWS పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా :పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు…