TEJA NEWS

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళనున్న కేటీఆర్

హైదరాబాద్:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు.

ఈ సాయంత్రం 5 గంటలకు వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. పార్టీ కీలక నేతలో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనుండటం తెలం గాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

వీరు ఎందుకోసం ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. కవిత బెయిల్ పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించ నుంది…

Print Friendly, PDF & Email

TEJA NEWS