TEJA NEWS

జర్నలిస్టు రమణ దశదినకర్మ కు 6500 ఆర్థిక సహాయం అందించిన—టీఎస్ జేఏ నాయకులు

సూర్యాపేట జిల్లా : గత కొన్ని సంవత్సరాలుగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంగా జర్నలిస్టుగా కొనసాగుతూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహిళా జర్నలిస్టు మెండెం రమణ దశదినకర్మకు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు 6500 రూపాయలు ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్,హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు అల్వాల రవికుమార్,నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS