సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ
పరవాడ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్.మల్లిఖార్జునరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ సీఐగా పనిచేసిన ఎస్.బాలసూర్యారావు అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ వీఆర్ లో ఉన్న మల్లిఖార్జునరావును ఇక్కడ సీఐగా ఉన్నతాధికారులు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందు బాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై గట్టి చర్యలు చేపడతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
TEJA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
TEJA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…